ప్రధానమంత్రి స్థాయిలో ఉండి.. ఓ పసిపాపను కాపాడేందుకు స్పెషల్ కేర్ తీసుకోవడం అంటే మాములు విషయం కాదు. దేశంకు ప్రధానమంత్రి అంటే.. నిమిషం తీరిక లేనంత బిజీగా ఉంటారు. అలాంటిది ఆ స్థాయి ఉన్న వ్యక్తి పసిపాప ప్రాణం కాపాడేందుకు స్పెషల్ ఏర్పాట్లు చేసి ఆ పాప ప్రాణాన్ని కాపాడారు. పూర్తి వివారాలోకి వెళ్తే.. అసోంకు చెందిన దుర్బజ్యోతి -కాలిటా దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది.
అయితే ఈ పాప పుట్టిన దగ్గర నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉంది. పాప పరిస్థితి రోజు రోజుకు సీరియస్ కావడంతో.. దిబ్రూగఢ్లోని ఆదిత్య ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఢిల్లీలోని గంగారామ్ ప్రైవేట్ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్లో తరలించాలని డాక్టర్లు నిర్ణయించారు. ఆ ఎయిర్ అంబులెన్స్ రాత్రి ఏడుగంటల టైంలో అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. రాత్రి ఏడుగంటలు అంటే ఢిల్లీ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. దాంతో ఆ పాప తండ్రి.. తమకు సహయం చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఢిల్లీ పోలీసులను కోరారు.
ఈ విషయం తెలుసుకున్న మోడీ.. వెంటనే ఢిల్లీ పోలీసులకు స్ట్రిట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి గంగారామ్ ఆసుపత్రి వరకు ట్రాఫిక్ ఫ్రీ ఏర్పాట్లు చేశారు. దీంతో అనుకున్న సమయంలో ఆ చిన్నారిని గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆ పాప ప్రస్తుతం కోలుకుంటోంది. దీంతో ఆ పాప తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. తమ చిట్టితల్లి ప్రాణాలు కాపాడిన మోడీతో పాటు ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
{youtube}qVwpdSPzcuY{/youtube}
Related