టెలికాం రంగంను జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పూర్తి ఉచితంగా వాయిస్ కాల్స్ మరియు డేటాను అందించి మిగిలిన టెలికం కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఇటీవలే అతి తక్కువ రేట్ల టారీఫ్లను ప్రకటించిన జియో ఈ ఆఫర్లను మరో సంవత్సరం లేదా సంవత్సరంనర వరకు పొడగించాలని చూస్తోందట.
జియో ఉచిత ఆఫర్లు మరియు తక్కువ రేట్లు ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువగా ప్రత్యర్థి కంపెనీలు అయిన ఎయిర్టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకు నష్టాలు తప్పవు. ఆ నష్టాలతో ప్రత్యర్థి సంస్థలు ప్రస్తుతం ఇస్తున్న ఆఫర్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు జియో టారీఫ్లను వర్తింపజేయనుంది. జియో మరో సంవత్సరం పాటు ఉచితాలు, తక్కువ రేట్ల ఆఫర్లు ప్రకటిస్తే జియోకు కూడా నష్టాలు తప్పవు. కాని అవి తాత్కాలిక నష్టాలు అని, భవిష్యత్తులో ఆ నష్టాలకు మూడు నాలుగు రెట్ల లాభాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
జియో వినియోగదారులు ప్రస్తుతం డేటా వినియోగంకు మరియు వాయిస్ కాల్ వినియోగంకు అవాటు పడ్డ తర్వాత వారు టారీఫ్లను చేయించుకునేందుకు సిద్దం అవుతారు. దానికి తోడు ఇండియాలో జియో అత్యధిక స్పీడ్తో డేటాను అందిస్తుంది. ఆ కారణంగా కూడా జియో వైపు వినియోగదారులు మొగ్గు చూపుతారని సదరు సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే జియో ఉచిత ఆఫర్లను ఇంకా కొనసాగించేందుకు కంపెనీ వర్గాలు నిర్ణయించాయి. 2019 నుండి జియో నుండి ఆదాయాన్ని ఆశిస్తున్నట్లుగా కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related