Thursday, May 16, 2024
- Advertisement -

కాంగ్రెస్ ముఖ్యనేత కేసీఆర్ ఏజెంట్ గా మారిపోయాడా?!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ లెజిస్ట్లేటివ్ పార్టీ అధ్యక్షుడు జానారెడ్డి అసలు కథ ఏమిటి? ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తున్నాడా? లేక పార్టీని నాశనం చేయడానికే కంకణం కట్టుకొన్నాడా? ముఖ్య హోదాలో ఉండి.. పార్టీ ని సరైన రీతిలో నడపకుండా జానారెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడా?

అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే జానారెడ్డి చాలా సార్లు తన వైఖరిని స్పష్టం చేశాడు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాట వైఖరి మంచిది కాదన్నట్టుగా మాట్లాడాడు జానారెడ్డి. 

 

తను మరీ ఎక్కువగా పోరాడితే.. గట్టిగా మాట్లాడితే కేసీఆర్ తనకు గౌరవం ఇవ్వడు అని చెప్పుకొన్నాడు జానారెడ్డి. ఇప్పుడు పెద్దాయనగా తనను జానారెడ్డి గౌరవిస్తున్నాడని.. ఇంతకు మించి ఎక్కువ అతి చేస్తే మాత్రం కేసీఆర్  అప్పుడు తనకు ఈ గౌరవం కూడా ఇవ్వడు.. అని జానారెడ్డి బయటకే చెప్పేశాడు. ఇలాంటి నేపథ్యంలో… ఇప్పుడు వస్తున్న వార్తలు.. జానారెడ్డి తీరు కొత్త అనుమానాలకు కారణం అవుతోంది.

 

జానారెడ్డి తనయుడు తెరాసలో చేరబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు లేదన్న భావనతో జానారెడ్డి తన తనయుడిని తెరాసలో చేరుస్తున్నాడట. దీంతోనే ఆయన తెరాస విషయంలో మరింత మెతకవైఖరినిఅనుసరిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రాణహిత వ్యవహారంలో కూడా జానారెడ్డి తెరాసపై పోరాట దృక్పథం వద్దని అంటున్నాడు. దీంతో ఆయన పక్కా కేసీఆర్ ఏజెంటుగా మారిపోయాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -