కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో.. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ముఖానికి మాస్కు పెట్టుకోవటం.. భౌతిక దూరాన్ని పాటించటం.. శానిటైజ్ చేసుకోవటం లాంటి చేయడం తప్పనిసరి. అయితే ఎంత జాగ్రత్త ఉన్నప్పటికి.. ఎవరో ఒకరు చేసే తప్పు వల్ల సమస్యలు వస్తాయి. ఎవరికి వారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. సింఫుల్ టెక్నిక్ లతో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు వీలుగా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందన్న మాట నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఆయుర్వేదంలో కరోనాలాంటి విపత్కర జబ్బుల్ని ఎదుర్కొనేందుకు.. అలాంటివి దరి చేరకుండా ఉండేందుకు కొన్నింటిని పాటిస్తే సరిపోతుందన్న అంటున్నారు. ఇంట్లో ఉండే వస్తువులతో కాస్త శ్రమపడితే మాయదారి రోగం దరి చేరకుండా ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- యోగా.. వ్యాయామాలు చేయటం
- వేపాకులు లేదా సాంబ్రాణి పొగను ఇంట్లో వేయాలి
- జీర్ణశక్తిని పెంచే ఆవాలు.. జీలకర్ర.. ధనియాలు.. అల్లం.. వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా వినియోగించాలి
- ఆహారం వేడివేడిగా తినాలి
- బాగా కాచిన కప్పు వేడి పాలల్లో అరచెంచా పసుపు కలిపి తాగాలి
- గోరువెచ్చని నువ్వుల నూనె రెండేసి చుక్కలు చొప్పున రెండు ముక్కుపుటాల్లో వేసి పది నిమిషాలు వెల్లకిలా పడుకోవాలి. అరగంట తర్వాత వేడినీటితో స్నానం చేయాలి (నువ్వుల నూనె నాణ్యమైనది.. మంచి బ్రాండెడ్ వాడాలన్నది మర్చిపోకూడదు)
- కప్పు నీటిని మరిగించాలి. అందులో రెండు చిటికెల మిరియాలపొడి.. చిటికెడు లవంగాల పొడి.. దాల్చినచెక్క పొడి వేసి బాగా కాయాలి. చివర్లో అయిదారు తులసి ఆకులు కూడా వేయాలి. దీనికి చెంచాడు తేనె కలిపి తాగితే మంచిది. కాకుంటే ఈ కషాయాన్ని ప్రతిరోజు సాయంత్రం తీసుకోవాలి. 30-40మి.లీ. చొప్పున రోజుకు రెండుసార్లు మాత్రమే తాగాలి. ఎక్కువ తాగకూడదు.
- తేలిగ్గా అరిగే ఆహారాన్ని తీసుకోవటం మంచిది. చేయకూడనివి :
- ఫ్రిజ్ లోని చల్లని నీళ్లు
- కూల్ డ్రింక్స్
- స్వీట్లు.. పెరుగు లాంటివి తగ్గించాలి
రవితేజ ఎంత మంది డైరెక్టర్లను పరిచయం చేశాడో చూడండి..!
టిక్ టాక్ తీసేయకుంటే ప్రమాదమేనట.. జాగ్రత్త..!