Wednesday, May 22, 2024
- Advertisement -

అబ్బో.. వెంకయ్యగారూ, నిజంగానే అంత సీన్ ఉందా..?!

- Advertisement -

ఎవరు ఏమని అన్నా.. తాము చాలా గొప్ప వాళ్లం అని.. ప్రదానమంత్రి మోడీ చాలా గొప్పవాడు అని అంటున్నారు వెంకయ్య నాయుడు గారు. ఈ విషయంలో మరో లెక్క లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొన్నటి వరకూ మోడీ అంటే త్రీడీ అని.. ఫోర్ డీ అని.. పొగడ్తలతో ముంచెత్తేవారు వెంకయ్య గారు.

మోడీ వైపు ప్రపంచం మొత్తం చూస్తోందని కూడా వెంకయ్య పదే పదే చెబుతూ వస్తున్నారు. మరి ఆ సంగతి అలా ఉంటే ప్రతిపక్షాల వైపు నుంచి మాత్రం మోడీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో వెంకయ్య ఎదురుదారి చేస్తున్నాడు. ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదని ఈయన స్పష్టం చేస్తున్నాడు. ఇంతకీ వెంకయ్య ఏమంటారంటే.. తమ విజయాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని అంటున్నారాయన! పాలన విషయంలో తాము దూసుకుపోతున్నామని.. దీన్ని సహించలేకే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అడ్డు పడుతోందని  వెంకయ్య చెప్పుకొస్తున్నాడు. 

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై కూడా మండి పడ్డాడు వెంకయ్య. రాహుల్ కు ఏపీలోని. రైతుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి తప్ప.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో నమోదవుతున్న రైతు ఆత్మహత్యలు మాత్రం కనపడలేదా? అని వెంకయ్య ప్రశ్నిస్తున్నాడు. మరి వెంకయ్య వేసిన ఈ ప్రశ్నలో లాజిక్ ఉంది కానీ.. తమ విజయాలను చూసి  ఓర్వలేకే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాయని అనడం మాత్రం విడ్డూరంగానే ఉంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -