Sunday, May 19, 2024
- Advertisement -

నిజం బయటపడేసరికి నిప్పు బ్యాచ్ సైలెంట్ అయ్యిందిగా

- Advertisement -

రాష్ట్రంలో ఏం తప్పు జరిగినా ఆ తప్పు వెనకాల జగన్ ఉన్నాడని చెప్పడం నిప్పు బ్యాచ్ నైజం. కేంద్రంలో బిజెపితో పొత్తు, రాష్ట్రంలో అదికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయడంలో విఫలమైన నిప్పు అందుకు కారణం జగన్ అంటాడు. ఇక టిడిపి మంత్రి కొడుకు సుశీల్ ఒక మైనారిటీ అమ్మాయిని వేధిస్తే అందుకు కూడా జగన్ కారణమన్న ఘనులు నిప్పు బ్యాచ్. ఇప్పుడు కూడా తొమ్మిదేళ్ళ బాలికను అత్యాచారం చేసిన సుబ్బయ్య వైకాపా పార్టీకి చెందినవాడు, సుబ్బయ్య బంధువులు వైకాపాలో ఉన్నారు అని నానా రచ్చా చేశారు పచ్చ బ్యాచ్. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే పూనకం వచ్చి ఊగిపోయిన రేంజ్‌లో సుబ్బయ్య వైకాపా మనిషి అని ప్రచారం చేశాడు.

కట్ చేస్తే సుబ్బయ్య టిడిపి మనిషి అని నిరూపించింది రోజా. సుబ్బయ్య ఫొటోతో ఉన్న టిడిపి సభ్యత్వం కార్డ్. టిడిపి వెబ్‌సైట్‌లో సుబ్బయ్య టిడిపి సభ్యుడిగా ఉన్న వివరాలన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించింది. కట్ చేస్తే పచ్చ బ్యాచ్ నోళ్ళన్నీ సైలెంట్ అయ్యాయి. ఇక రోజా చెప్పిన మాటలేవీ పచ్చ మీడియాలో కనిపించలేదు. సుబ్బయ్యకు టిడిపి ఇచ్చిన సభ్యత్వ కార్డ్……అది కూడా సుబ్బయ్య ఫోటోతో ఉన్న కార్డ్, టిడిపి వెబ్‌సైట్‌లో సుబ్బయ మెంబర్‌షిప్ డిటెయిల్స్‌ని రోజా సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తే కనీసం వార్తగా కూడా ప్రచురించలేదు పచ్చ మీడియా జనాలు. ఇక నిన్నటి వరకూ సుబ్బయ్య వైకాపా మనిషి అని ప్రచారం చేసి ముఖ్యనేత నిప్పు నారా బాబు నుంచి డప్పు నేతల వరకూ అందరూ కూడా రోజా ప్రెస్ మీట్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. అదీ పచ్చ బ్యాచ్ తీరు. వాళ్ళ చేతగానితనాన్ని, వైఫల్యాలను, తప్పులను అన్నింటినీ జగనే చేశాడు, అన్నింటి వెనకాల జగనే ఉన్నాడు అని విష ప్రచారం చేసి జనాలను నమ్మించి, మోసం చేసి అధికారంలోకి రావాలన్న యావ తప్ప వేరే ఏమైనా ఉందా? నిజాయితీగా రాజకీయాలు చేయగలరా? నిప్పు నిజాయితీని మాటల్లో కాదు……… చేతల్లో చూపగలడా ఎప్పటికైనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -