Sunday, May 19, 2024
- Advertisement -

పెళ్లి చేస్తామని చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి.. ఏం చేశారంటే..?

- Advertisement -

లవ్ మ్యారేజ్ చేసుకున్న తమను విడదీసి.. తన భార్యను ఆమె మేనమామ తీసుకెళ్లిపోయాడు అని ఆమె భర్త హరికృష్ణ అనే యువకుడు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయంలోకి వెళ్తే.. వెల్లికల్లు ఎస్టీ కాలనీకి చెందిన కానూరు నరసింహులు, నాగమ్మ దంపతుల కూతురు అనూష.

ఆమె ఈ నెల ఒకటవ తేదిన అదే కాలనీలో ఉంటున్న హరికృష్ణ వద్దకు వచ్చి.. తన ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. హత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని హరికృష్ణ తెలిపాడు. దీంతో కంగారుపడిపోయిన హరికృష్ణ.. తమ ప్రేమ వ్యవహారాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. వారు అంగీకరించడంతో తన బంధువుల ఇంటి దగ్గర ఆదివారం పెళ్లిచేసుకున్నట్లు హరికృష్ణ తెలిపాడు. ఆ తెల్లారి సోమవారం మార్నింగ్ వెంకటగిరి పట్టణానికి చెందిన అనూష మేనమామ అయిన అంకారావు అమ్మాయి తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేస్తామని.. రాకపోతే ఇద్దరిని చంపేస్తానని బెదిరించి ఆటోలో తమను తీసుకెళ్లినట్లు తెలిపాడు.

వెలికల్లుకు రాగానే ఆటోలో నుంచి తనను కిందకు బలవంతంగా దీంచేసి.. అనుషను వెంకటగిరి వైపు బలవంతగా తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. దాంతో విషయం పోలీసుల వద్దకు తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇదే విషయంపై ఏఎస్సై నారాయణస్వామిని వివరణ కోరగా ఇరువురిని పిలిపించి.. విచారిస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -