దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతోన్న చివరిదైన ఐదో వన్డేలోనూ భారత మహిళల పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు ప్రియా పూనియా (18), స్మృతి మంధానా (18)కి తోడు పూనర్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) విఫలమయ్యారు. హర్మన్ప్రీత్ కౌర్ (30) పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది.
సిరీస్లో తన ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి సత్తాచాటింది సారథి మిథాలీ రాజ్. ఓవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 104 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఫలితంగా టీమ్ఇండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది.దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ క్లర్క్ 3 వికెట్లతో రాణించగా, షంగేస్ 2, సేఖుఖునే 2, మరిజన్నే ఒక వికెట్ దక్కించుకున్నారు.
బెంగాల్ లో బొగ్గు స్కాం లో కొత్త కోణం.. అదుపులో మరొక వ్యక్తి..?
కర్ణాటక వక్ఫ్ బోర్డు కీలక ప్రకటన.. లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు..!