Wednesday, April 24, 2024
- Advertisement -

మరోసారి తన బ్యాటింగ్ సత్తాచాటిన సారథి మిథాలీ రాజ్!

- Advertisement -

దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతోన్న చివరిదైన ఐదో వన్డేలోనూ భారత మహిళల పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు ప్రియా పూనియా (18), స్మృతి మంధానా (18)కి తోడు పూనర్ రౌత్ (10), హేమలత (2), సుష్మ వర్మ (0) విఫలమయ్యారు. హర్మన్​ప్రీత్ కౌర్ (30) పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగింది.

సిరీస్​లో తన ఫామ్​ను కొనసాగిస్తూ మరోసారి సత్తాచాటింది సారథి మిథాలీ రాజ్. ఓవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 104 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్​గా నిలిచింది. ఫలితంగా టీమ్ఇండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది.దక్షిణాఫ్రికా బౌలర్లలో నదీన్ క్లర్క్ 3 వికెట్లతో రాణించగా, షంగేస్ 2, సేఖుఖునే 2, మరిజన్నే ఒక వికెట్ దక్కించుకున్నారు.

బెంగాల్ లో బొగ్గు స్కాం లో కొత్త కోణం.. అదుపులో మరొక వ్యక్తి..?

కర్ణాటక వక్ఫ్​ బోర్డు కీలక ప్రకటన.. లౌడ్​ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు..!

శాసనమండలి సంతాపం.. నోముల నువ్వు గుండెలలో నిలిచావు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -