శాసనమండలి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సభ్యులు లేచి నిలబడి మౌనం పాటించారు. అనంతరం నోముల చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నో పోరాటాలు చేశారని సభ్యులు కొనియాడారు.
1956 జనవరి 9న నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో జన్మించారు. నోముల నర్సింహయ్య… విద్యార్థి దశ నుంచే సంఘాల్లో పనిచేసి నాయకత్వ లక్షణాల్ని ప్రోది చేసుకున్నారు. 1973లో ఎస్ఎస్సీ, 73 నుంచి 75 వరకు ఇంటర్, 75 నుంచి 78 వరకు డిగ్రీ (బీఏ) చివరి సంవత్సరంలో ఉండగానే సీపీఎం సభ్యత్వం పొందిన నోముల… అప్పట్నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే వచ్చారు.
1978లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్యూలో చేరి… కొండపల్లి సీతారామయ్య వద్ద కొద్దిరోజులు అనుచరుడిగా పనిచేశారు. ముసుగు వెంకటనర్సింహారెడ్డి అనే వ్యక్తి ద్వారా నోముల… ఆర్ఎస్యూ నుంచి బయటపడి సీపీఎంలో చేరారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున!
అనుమానాస్పద స్థితిలో ఎంపీ మృతి.. పోస్ట్మార్టం రిపోర్ట్ తరువాత నిజాలు..!