2019 ప్రపంచకప్ ఇంగ్లాండు వేదికగా జరగనుంది. ఈ టొర్నీ నిర్వహణపై కోల్కతాలో కోల్కతాలో మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రత్యేక సమావేశం నిర్వహించింది. టోర్నీ నిర్వహనపై విస్త్రుతంగా చర్చించారు. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్ విడుదలవగా దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని మార్పులు సూచించింది.
ఐపీఎల్ 2019 సీజన్ ముగిసిన రెండు వారాల్లోపే ప్రపంచకప్లో టీమిండియా ఆడటం కష్టమని.. కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలంటూ గతంలో లోధా కమిటీ సూచించిన సూచనని ఇక్కడ బీసీసీఐ ప్రస్తావించింది. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది. భారత్ జట్టు తొలి మ్యాచ్ని జూన్ 2న దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉండగా.. తాజాగా బీసీసీఐ సూచించిన మార్పుల నేపథ్యంలో.. జూన్ 4కి ఈ మ్యాచ్ని మార్చనున్నారు. 2019 ఐపీఎల్ సీజన్ మార్చి 29న మొదలై.. మే 19న ముగియనుంది. దీంతో.. 15 రోజుల గ్యాప్ తర్వాత ప్రపంచకప్లో టీమిండియా ఆడనుంది.