- Advertisement -
క్రికెట్ దిగ్గజం మాస్టర్, బ్లాస్టర్ సచిన్ కొడుకు అర్జున్ ముంబై టీ20 లీగ్ వేలం పాటలో రూ.5 లక్షలకు అమ్ముడుపోయాడు.లీగ్ రెండో సీజన్ కోసం జరిగిన వేలంలో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ యాజమాన్యం అర్జున్ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది.
అండర్-19 భారత జట్టు తరఫున అనధికారిక టెస్ట్ మ్యాచ్లాడిన ఆల్రౌండర్ అర్జున్ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆఖరిదాకా ప్రయత్నించాయి. కనీస ధర రూ.లక్షతో వేలంలోకి ప్రవేశించిన ఈ జూనియర్ మాస్టర్ను తొలుత నార్త్ముంబై పాంథర్స్ జట్టు 5 లక్షలకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. సచిన్ బ్రాండ్ అంబాసీడర్గా వ్యవహరిస్తున్న ముంబై టీ20 లీగ్ ఈనెల 14న మొదలవుతుంది. సూర్యకుమార్, సిద్దేశ్ లా డ్, పృథ్వీషా, అయ్యర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఈ లీగ్లో బరిలోకి దిగుతున్నారు.