Thursday, May 2, 2024
- Advertisement -

భార‌త్ తిర‌స్క‌రించ‌డంతో వేదిక మారిన ఆసియాక‌ప్ టోర్న‌మెంట్….

- Advertisement -

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో సెప్టెంబర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాక్ క్రికెట్ జట్టుకు తాను ఆతిథ్యం ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పింది. దీంతో చేసేదేం లేక వేదిక మారుస్తున్నట్లు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది. ఈ విషయాన్ని ఏసీసీ, పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ ప్రకటించారు.

ఈ ఏడాది ఆసియా కప్‌లో ఐసీసీ పూర్తి సభ్యదేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ తలపడనున్నాయి. ఆరో స్థానం కోసం యూఏఈ, హాంగ్ కాంగ్, నేపాల్, సింగపూర్, మలేసియా, ఒమన్ పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్ ద్వారా ఆరో జట్టును ఎంపిక చేస్తారు.

ఆసియా కప్‌ను నిర్వహించడం ఇది 14వ సారి కాగా.. 12 సార్లు వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. 2016 ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇది వరల్డ్ కప్ టీ20 టోర్నీకి వార్మప్‌గా ఉపయోగపడింది. ఆ టోర్నీ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -