భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన భావోద్వేగాలను మైదానంలో చూపడు. కానీ అరుదుగా బౌలర్ల, బ్యాట్స్ మెన్ల వ్యవహారశైలితో మహి ఒక్కసారిగా కోపం ప్రదర్శిస్తూ ఉంటాడు. తాజాగా ఆసియా కప్ లో నిన్న ఆఫ్గానిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోని సహనాన్ని కోల్పోయాడు.
ఏ బౌలర్కు ఎలా ఫీల్డింగ్ సెట్ చేయాలో అందరికీ తెలుసు. అలాంటి ధోనికే ఫీల్డర్ను మార్చాల్సిందిగా సలహా ఇచ్చాడు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. దీనిపై ధోని కాస్తంత ఘాటుగానే స్పందించాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ను మార్చాల్సిందిగా కుల్దీప్ పదే పదే అడుగుతుండటంతో ధోనీ అసహనానికి గురయ్యారు.
‘బౌలింగ్ చేస్తావా.. లేక బౌలర్ నే మార్చమంటావా?’ అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కుల్దీప్ సైలెంట్ గా బౌలింగ్ చేసేందుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో వికెట్ల వెనుక ఏర్పాటు చేసిన మైక్రోఫోన్ లో రికార్డయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
https://twitter.com/rahulmehra__/status/1044703278099877888