ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్కే మొగ్గు చూపాడు. అయితే జట్టులో రెండు మార్పులు చోటు చేసకున్నాయి. ఖలీల్, శార్ధూల్ టాగూర్ స్థానంలో బూమ్రా, ప్యాండ్యను తీసుకున్నారు. పాక్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ దాయాది జట్లు చివరిసారి తలపడగా.. ఆ మ్యాచ్లో పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. కెప్టెన్ విరాట్ లేకపోవడం భారత్కు బలహీనంగా కనిపిస్తున్నా ….హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో ధావన్, రాయుడు మెరుపు ఇన్నింగ్స్లతో ఫామ్లోకి రావడం ఊరటనిచ్చే అంశం.
తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాయుడు, ధోని, కార్తిక్, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్,బుమ్రా, చహల్, కుల్దీప్
పాకిస్తాన్: ఇమామ్, ఫకార్, బాబర్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, షాదాబ్, ఫహీమ్, ఆమిర్, హసన్, ఉస్మాన్ ఖాన్