బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆసీస్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. తాజాగా ఈ అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి క్రికెట్కు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన కామెరాన్ బాన్క్రాప్ట్తో పాటు జట్టు సారథి స్టీవ్ స్మిత్పై ఫైన్ సహా నిషేధాన్ని విధించింది. స్మిత్పై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో పాటు మ్యాచ్ ఫీలో 100 శాతం ఫైన్ విధించింది. బాన్క్రాప్ట్కు మ్యాచ్ ఫీలో 75 శాతం ఫైన్తో పాటు 3 డీమెరిట్ పాయింట్లను కేటాయించింది.
ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం వారిపై జీవితకాల నిషేధం విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లతో పాటు బ్యాట్స్ మెన్ కెమెరాన్ బెన్ క్రాఫ్ట్ లను జీవితకాల నిషేధాన్ని విధించాలని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిపై పూర్తి నిషేధాన్ని విధించాలని మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన స్వతంత్ర కమిషనర్ రిపోర్టును సమర్పించారు.
వీరు చేసిన నేరానికి ఒక మ్యాచ్ నిషేధం, లేదా ఓ మ్యాచ్ లో 100 శాతం ఫీజు జరిమానా ఎంతమాత్రమూ సరిపోవని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. క్రికెట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని గరిష్ఠ శిక్షను అనుభవించేందుకు వీరు అర్హులని, వీరింక తమ జీవితకాలంలో క్రికెట్ ఆడకుండా చేస్తేనే ఆసీస్ పరువు నిలబడుతుందని వ్యాఖ్యానించారు. తాము బాల్ ను ట్యాంపర్ చేశామరి అది జట్టు వ్యూహంలో భాగమని స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.