Sunday, May 5, 2024
- Advertisement -

వార్న‌ర్‌, స్మిత్ శిక్ష‌పై యూట‌ర్న్ తీసుకున్న హ‌రిభ‌జ‌న్‌..

- Advertisement -

బాల్ ట్యాంపరింగ్ వివాదంపై భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ యూ టర్న్ తీసుకున్నాడు. తప్పు చేశారని తేలినా ఆస్ట్రేలియా క్రికెటర్ బాన్ క్రాఫ్ట్‌పై నిషేధం విధించడానికి ఆలోచిస్తున్నారని, కానీ గతంలో తమ జట్టు కేవలం మోతాదుకు మించి అప్పీల్ చేశామన్న కారణంగా ఆరుగురు ఆటగాళ్లపై వేటు వేయడం, మంకీ గేట్ వివాదంలో ఏ తప్పుడు చేయకున్నా తనకు శిక్ష విధించారని ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాడు.

అయితే తాజాగా దానిపై యూట‌ర్న్ తీసుకున్నారు. ‘కేవలం బాల్ ట్యాంపరింగ్‌ కు పాల్పడ్డారన్న కారణంగా ఆసీస్ ఆటగాళ్లపై ఏడాది నిషేధం విధించడం జోక్‌. వాళ్లు ఏ నేరానికి పాల్పడ్డారని ఇంత పెద్ద శిక్ష వేశారు. ఆట నుంచి ఏడాది పాటు దూరం చేయడం తెలివి తక్కువ నిర్ణయం. ఒక టెస్ట్ సిరీసో లేక రెండు సిరీస్‌ లకు నిషేధం పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇది దారుణం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ లపై నిషేధం గడువును క్రికెట్ స్ట్రేలియా తగ్గించాలి’ అంటూ తాజాగా హర్భజన్ ట్వీట్ చేశాడు.

 

 

కొద్ది రోజుల క్రితం హ‌ర్భ‌జ‌న్ చేసిన ట్విట్‌…

వావ్ ఐసీసీ. ట్యాంపరింగ్‌ వివాదంలో గొప్ప శిక్షే వేశారు. అన్ని ఆధారాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం లేదు. గతాన్ని మర్చిపోయారా. మితిమిరి అప్పీల్‌ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కొ మ్యాచ్‌ నిషేధించారు. 2008 సిడ్నీ టెస్టులో ఎలాంటి ఆధారాలు లేకుండానే జాతి వివక్ష వ్యాఖ్యలంటూ (మంకీగేట్‌ వివాదం) నాపై మూడు టెస్టుల వేటేశారు. వ్యక్తిని, అతను ప్రాతినిథ్యం వహించే జట్టును బట్టి అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?’ అని ట్వీట్‌ ద్వారా హర్భపన్ ప్రశ్నించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -