Wednesday, May 15, 2024
- Advertisement -

మ్యాచ్ మధ్య పిచ్ మీదకు కారు వచ్చింది.. షాక్ అయిన ఇషాంత్ శర్మ, గంభీర్

- Advertisement -

ఓ వ్యక్తి తాజాగా ఢిల్లీ-రంజీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న టైంలో కారు వేసుకొని పిచ్ మీదకువచ్చాడు. ఈ ఘటన పలామ్ లోని ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ లో జరిగింది. ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు అయిన ఇషాంత్ శర్మ, గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్ లు గ్రౌండ్ లోనే ఉన్నారు. ఈ ఘటనతో బీసీసీఐ సెక్యూరిటీ ఏర్పాట్ల గురించి మరోసారి చర్చించుకోసాగారు.

గిరీష్ శర్మ అనే వ్యక్తి కారును పార్కింగ్ లాట్ లోకి తీసుకొని వెళ్ళకుండా డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి పోనిచ్చాడు. అది కూడా 30 యార్డ్స్ సర్కిల్ లో రెండు రౌండ్లు వేశాడు. ఆ టైంలో క్రికెటర్లు అందరూ ఏమి జరుగుతోందో తెలీక భయపడుతూ చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత గ్రౌండ్ సిబ్బంది రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ దీనిపై విచారణ చేస్తున్నామని.. దీన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని అన్నారు. ఈ మ్యాచ్ ఫీరోజ్ షా కోట్లా మైదానంలో జరగాల్సి ఉండేది. అయితే నవంబర్ 1 న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ ఉండడంతో ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ కు తరలించారు. ఈ ఘటనపై ఇషాంత్ శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -