- Advertisement -
ఐపీఎల్ 2021 మినీ వేలం కొనసాగుతోంది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. ఈ ఆటగాడి తీరు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దాంతో ఐపీఎల్ లో మంచి డిమాండ్ ఉంది. తాజాగా క్రిస్ మోరిస్ రూ.16.25కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు.
అతని కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటీ పడి బిడ్లు దాఖలు చేశాయి. కేవలం రూ.75 లక్షల బేస్ ప్రైస్తో ఎంట్రీ ఇచ్చిన మోరిస్.. చివరికి రికార్డు స్థాయిలో ఆయన వేలానికి పోవండం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఆ స్థాయిలో ఏ ఆటగాడు కైవసం చేసుకుంటాడో చూడాలి.