ఐపిఎల్ 2021లో భాగంగా జరిగన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడిచింది. చెన్నై నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు సాధించడంలో నానా అవస్థలు పడింది. మొత్తానికి 9 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
టాస్ గెలిచిన దోని బ్యాటింగ్ తీసుకున్నారు. మొదటి నుంచి దుందుడుకుగా ఆడుతూ 192 పరుగులు చేశారు. అయితే జెడేజా 64 (28) రన్స్ చేసి జట్టుకు కీలక విజయాన్ని సమకూర్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(8), వాషింగ్టన్ సుందర్(7), మాక్స్ వెల్(22), ఎబి డివిలియర్స్(4), హర్షల్ పటేల్(0), నవదీప్ సైనీ(2), జేమిసన్(16)లు ఘోరంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా మూడు కీలక వికెట్లు తీయగా.. తాహీర్ రెండు వికెట్లు, శార్దుల్, శామ్ కరన్ లు తలో వికెట్ పడగొట్టారు.
భార్గవ్ విషయంలో అసలు విషయాలు బయటపెట్టిన ఫన్ బకెట్ టీమ్..!
మహారాష్ట్రలో మద్యం దొరకక శానిటైజర్ తాగిన వైనం.. ఏడుగురి మృతి
తెలంగాణలో కరోనా టీకా ఉచితం.. ప్రజల ప్రాణాలకన్నా డబ్బు ముఖ్యం కాదు : కెసిఆర్