Monday, May 6, 2024
- Advertisement -

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్‌డేవిల్స్‌…

- Advertisement -

పీఎల్ 2018 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌‌లాడిన చెన్నై జట్టు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై భారీ విజయాన్ని అందుకున్న ఢిల్లీ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొంది పట్టికలో చివరి స్థానంలో ఉంది.

కోల్‌కతాపై మ్యాచ్‌లో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయాస్ అయ్యర్ శతక సమాన ఇన్నింగ్స్‌తో చెలరేగి ఢిల్లీ జట్టులో నూతనుత్తేజం నింపాడు. చెపాక్ స్థానంలో సొంత వేదికగా ఎంచుకున్న పుణె‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటం ధోనీసేనకి ఇక్కడ కలిసొచ్చే అంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -