ఢిల్లీ కేపిటల్స్ అదరగొట్టింది. ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 223 పరుగుల భారీ టార్గెట్ను రాజస్థాన్ ముందుంచిన ఢిల్లీ..దానిని కాపాడుకోవడం సక్సెస్ అయింది.
ఓపెనర్లు జైస్వాల్ (4), బట్లర్ (19) ,పరాగ్ ( 27),శుభమ్ దూబే (25) పరుగులు చేయగా కెప్టెన్ సంజు శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సంజూ శాంసన్ 46 బంతుల్లో 6 సిక్స్లు,8 ఫోర్లతో 86 పరుగులు చేశారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతుండటంతో జరగాల్సిన నష్టం జరిగిపోగా రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 201 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది ఢిల్లీ.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 8 వికెట్లు కొల్పోయి 221 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్మెన్ జేక్ ఫ్రేసర్ 20 బంతుల్లో 50 పరుగులు చేసి శభాష్ అనిపించగా అభిషెక్ పొరెల్ 36 బంతుల్లో 65 పరుగులు చేశారు. ఇక చివర్లో స్టబ్స్ 20 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. కుల్దీప్ యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.