ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడిన పంజాబ్ జట్టు నాల్గింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాల్గింటిలో ఓడిన ఢిల్లీ జట్టు చివరి స్థానంలో ఉంది.
గత మూడు మ్యాచ్ల్లో ఒక శతకంతో పాటు రెండు మెరుపు అర్ధశతకాలు బాదిన ఒంటిచేత్తో పంజాబ్ని గెలిపించిన క్రిస్గేల్ అనారోగ్యం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఫామ్లో ఉండటం పంజాబ్కి ఇక్కడ కొంత ఉపశమనం.
పంజాబ్ తుది జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా క్రిస్గేల్ జట్టుకి దూరమవగా.. అతని స్థానంలో డేవిడ్ మిల్లర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. గాయంతో క్రిస్ మోరీస్, జేసన్ రాయ్ జట్టుకి దూరమవగా.. వారి స్థానంలో డాన్ క్రిస్టియాన్, ఫ్లంకెట్ జట్టులోకి వచ్చారు.