Wednesday, May 8, 2024
- Advertisement -

ఇషాంత్‌కు జ‌రిమాణా విధించిన ఐసీసీ….

- Advertisement -

ఇంగ్లాండ్‌తో శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో క్రమశిక్షణ తప్పిన భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. ఆటలో మూడో రోజైన శుక్రవారం ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్(20)ని ఔట్ చేసిన ఇషాంత్ శర్మ అత్యుత్సాహ‌తో .. అతడ్ని దూషిస్తూ మైదానంలో హద్దులు మీరి సంబరాలు చేసుకున్నాడు.

ఐసీసీ ప్రవర్తనా నియామావళి ప్రకారం.. ఎవరైనా క్రికెటర్‌ ఔటైన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాడు మాటలతో కానీ, లేక చేతలతో కానీ (సంజ్ఞలు) వెటకారం చేయకూడదు. ఇలా చేస్తే ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఆర్టికల్‌ 2.1.7 ను అనుసరించి ఆటగాడికి గరిష్టంగా 50శాతం ఫీజులో కోతతో పాటు 1 లేక 2 డీమెరిట్‌ పాయింట్లు కేటాయిస్తారు. మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రో ఎదుట బౌలర్ ఇషాంత్‌ తన తప్పిదాన్ని అంగీకరించడంతో శిక్ష పరిమితిని తగ్గించినట్లు సమాచారం.తొలి టెస్ట్‌లో టీమిండియా 162 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 31 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఇంగ్లండ్‌ ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 9 నుంచి జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -