Sunday, April 28, 2024
- Advertisement -

కోహ్లీసేన‌పై పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్‌ సెటైర్లు….

- Advertisement -

ఇగ్లాండ్ గడ్డ మీద భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి టెస్టులో పోరాడి ఓడిన కోహ్లి సేన, రెండో టెస్టులో చేతులెత్తేసింది. దీంతో టీమిండియాపై సర్వత్రా వ‌స్తున్న విమర్శలు ఆగ‌డంలేదు. బ్యాటింగ్ వైఫ‌ల్యం ప‌ట్ల మాజీ క్రికెట‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంగ‌తి తెల‌సిందే.

తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కోహ్లి సేనపై, బీసీసీఐపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. నేను రెండుసార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించాను. రెండు సందర్భాల్లోనూ పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్‌లో పర్యటించిన ఆసియా జట్టు ఏదైనా.. అక్కడి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి కష్టాలు పడుతుంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపేం కాద‌న్నారు.

పాకిస్థాన్ మాత్రం 2016లో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. మిస్బా కెప్టెన్సీలో లార్డ్స్, ఓవల్‌లో గెలిచాం. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఎక్కువగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటమే ఇందుకు కారణ’’మని సర్ఫరాజ్ తెలిపాడు.

2016లో సిరీస్ ఆరంభం కావడానికి 25 రోజుల ముందే మేం ఇంగ్లాండ్ చేరుకున్నాం. 10 రోజుల క్యాంప్, రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం మాకు ఎంతో ఉపకరించిందని సర్ఫరాజ్ తెలిపాడు.ఈ ఏడాది ఆరంభంలో సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాక్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఈసారి కూడా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గెలిచిన పాక్.. తర్వాతి టెస్టులో ఓడి సిరీస్ డ్రా చేసుకుంది. మేం రెండు పర్యాయాల్లోనూ ఇండియా కంటే మెరుగ్గా సన్నద్ధమయ్యాం. భారత్ కేవలం ఒకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. అది కూడా మూడ్రోజులపాటే. ముందుగా వన్డేలు, టీ20 ఆడటం ఇంకా చేటు చేసింద’’ని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -