Thursday, May 2, 2024
- Advertisement -

పాండ్య పై ఫ్యాన్స్ ఫైర్.. ఇంత తలపోగరా?

- Advertisement -

టి20 వరల్డ్ కప్ తరువాత భారత్ న్యూజిలాండ్ పర్యటన వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కివీస్ జట్టుతో టీమిండియా మూడు టి20 లతో పాటు, మూడు వన్డేలు కూడా అడనుంది. ఇప్పటికే టి20 సిరీస్ ను టీమిండియా 1-0 తో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండవ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక మూడవ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో టీమిండియా సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ టి20 సిరీస్ లో జట్టు కూర్పు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సంజు సంసాన్ ను జట్టులోకి తీసుకోకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

వరుసగా విఫలం అవుతున్న రిషబ్ పంత్ కు అవకాశం కల్పిస్తూ.. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కల్గి ఉన్న సంజూ ను ఎందుకు పక్కన పెడుతున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా విపరీతంగా కామెంట్స్ పెట్టారు. అయితే చివరి మ్యాచ్ అనంతరం మీడియా మాట్లాడిన కెప్టెన్ పాండ్య ఊహించని విధంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ” ఇది తన టీం అని.. ఎవరిని ఎంపిక చేయాలో సెలక్షన్ టీంతో చర్చించిన తరువాతే ప్లేయర్స్ ను తీసుకున్నామని ” పాండ్య చెప్పుకొచ్చాడు. బయట ఏమి అనుకుటున్నారో తనకు సంబంధం లేదని, చిన్న సిరీస్ కావడంతో అందరికీ అవలశాలు ఇవ్వలేకపోయామని ” పాండ్య చెప్పుకొచ్చాడు. అయితే పాండ్య మాట్లాడినా విధానంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అగ్రహిస్తున్నారు. పాండ్య అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడని, ఇలా అయితే అతను కెప్టెన్ గా రాణించడం చాలా కష్టమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్ లకు టి20 వరల్డ్ కప్ తరువాత విశ్రాంతి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -