Monday, April 29, 2024
- Advertisement -

2012లోనే ధోనీని పక్కకు తప్పించాలని ప్లాన్.. కానీ ధోనీ నిలబెట్టింది ఎవరు..?

- Advertisement -

భారత్ కి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌‌ని అందించాడు మాజీ కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. అయితే 2011 తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారట. ఈ సంగతిని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఇటీవల రచించిన ‘డెమోక్రసీస్‌ ఎలెవన్‌ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకంలో వెల్లడించారు. అయితే.. ఈ టైంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో సెలక్టర్లు వెనక్కి తగ్గారట.

2014, డిసెంబరులో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఈ ఏడాది జనవరిలో టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తానే పక్కకి తప్పుకున్న సంగతి తెలిసిందే. ధీనీ కెప్టెన్సీలో బాగా రాణించిన భారత్ జట్టు 2011లో ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత అతడిని కెప్టెన్సీ నుండి పక్కకు తప్పించేందుకు మొహిందర్ అమరనాథ్ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. కానీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా హోదాలో నేను ఆ నిర్ణయాన్ని తిరస్కరించారు. అలా చేయడాన్ని పక్షపాతం అని మీరు అనుకోవచ్చు. కానీ.. 2007‌లో టీ20 ప్రపంచకప్, 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించిన గొప్ప కెప్టెన్‌కి నేనిచ్చే గౌరవమని నా భావన’ అని శ్రీనివాసన్ ఆ పుస్తకంలో తన అభిప్రాయన్ని స్పష్టం చేశారు.

2013లో తనపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ధోనీ కూడా ఈ పుస్తకం ద్వారా స్పందించారు. “నేను బాగా ఆడకుంటే ఖచ్చితంగా విమర్శించండి. అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ ఫిక్సింగ్ లో పాల్పడినట్లు ఆరోపించకండీ. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది క్రికెట్ వల్లే. అప్పట్లో మీడియాలో నాపై ఆరోపణలు మరీ బాధించేలా వచ్చాయి” అని ధోనీ వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -