వన్డే ర్యాంకింగ్స్ను ఫలితాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ ర్యాంకిగ్స్లో మనోల్లే టాప్గా నిలిచారు. బ్యాట్స్మెన్ జాబితాలో ఇప్పటికే టాప్లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. బౌలర్ల ర్యాంకింగ్స్లో నెం.1 స్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా పదేళ్ల తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.
బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 841 పాయింట్లతో తన నెం.1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వెస్టిండీస్తో కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడిన బుమ్రా.. ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా.. తన ర్యాంక్ని నిలబెట్టుకున్నాడు. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్.. 723 పాయింట్లతో కెరీర్ బెస్ట్.. మూడో ర్యాంక్ని అందుకోగా.. చాహల్ (683) తొలిసారిగా టాప్-10లోకి ప్రవేశించి 8వ స్థానంలో నిలిచాడు.
వెస్టిండీస్ని ఐదు వన్డేల సిరీస్లో 3-1 తేడాతో ఓడించినా.. టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ జట్టు అగ్రస్థానానికి ఎగబాకలేకపోయింది. ప్రస్తుతం 121 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కేవలం ఐదు పాయింట్లు ఎక్కువగా ఉన్న ఇంగ్లాండ్ (126) నెం.1 స్థానంలో ఉంది.