Tuesday, May 21, 2024
- Advertisement -

ధోనికి రెస్ట్‌… మ‌రో ఇద్ద‌రిపై వేటు త‌ప్ప‌దా….?

- Advertisement -

మొహాలీలో ఇవాళ భారత్ – ఆసీస్ మధ్య నాల్గో వన్డే జరగనుంది. ఇప్ప‌టికే టీమిండియా 2-1తో ఆధిక్యంతో ఉంది. మొద‌టి రెండు వ‌న్డేలు గెలిచిన టీమిండియా మూడో వ‌న్డేలో ఓట‌మిని చ‌విచూసింది. అయితే భార‌త్‌ను ఇప్పుడు ఓపెన‌ర్ల స‌మ‌స్య వెంటాడుతోంది. మూడో వ‌న్డే ఓట‌మి త‌ర్వాత జ‌ట్టులో మార్పులు ఉంటాయ‌ని కోహ్లీ సంకేతాలిచ్చాడు. ఇద్ద‌రిపై వేటు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ధోనికి రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్‌….పంత్‌కు అవ‌కాశం క‌ల్పించింది.పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న శిఖర్ ధావన్, అంబటి రాయుడిపై వేటు వేసి కేఎల్ రాహుల్‌కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టీ20ల సిరీస్‌లో రాహుల్ బ్యాక్ టు బ్యాక్ అర్ధశతకాలు సాధించిన విషయం తెలిసిందే. రాయుడిపై వేటు పడితే..? అప్పుడు రిషబ్ పంత్ నెం.4 స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక నాలుగో వన్డే మొహాలి వేదికగా ఈరోజు మధ్యాహ్నం 1.30 నుంచి జరగనుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -