Monday, April 29, 2024
- Advertisement -

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు..రోహిత్ సేన గెలిచేనా!

- Advertisement -

ఇంగ్లాండ్‌తో వైజాగ్ వేదికగా ఇవాళ రెండో టెస్టు జరగనుంది. ఉదయం 9.30 నుండి మ్యాచ్ ప్రారంభం కానుండగా కోహ్లీ, షమీ, రాహుల్‌, జడేజా ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో టీమ్‌ ఎంపిక జట్టుకు కష్టంగా మారింది.

తుదిజట్టులో స్పిన్నర్‌ కుల్దీప్‌తో పాటు రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్ ఖాన్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇంగ్లీష్ జట్టు సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ స్థానంలో అండర్సన్‌, లీచ్‌ ప్లేస్‌లో బషీర్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇక స్పిన్నర్ అశ్విన్ మ్యాచ్‌లో 4 వికెట్లు తీస్తే భారత్‌ తరపున 500 టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.

తుది జట్లు : భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), యశస్వి, గిల్‌, శ్రేయస్‌, రజత్‌ పాటిదార్‌, అక్షర్‌, భరత్‌, అశ్విన్‌, కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌.

ఇంగ్లండ్‌: స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రాలీ, డకెట్‌, పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, ఫోక్స్‌, రెహాన్‌, హార్ట్లీ, బషీర్‌, అండర్సన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -