Sunday, May 19, 2024
- Advertisement -

సెమీఫైన‌ల్లో ప‌ట్ట‌స‌డ‌లించ‌ని భార‌త్‌…ప‌రుగుల‌కోసం ఆప‌సోపాలు ప‌డుతున్న కీవీస్‌

- Advertisement -

న్యూజిలాండ్‌తో మాంచెస్టర్ వేదికగా ఈరోజు జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. మొద‌టినుంచి క‌ట్టుదిట్ట‌మైన బంతులను భార‌త బౌల‌ర్లు విసురుతుండంతో కీవీస్ ప‌రుగులు చేయ‌డానికి ఆప సోపాలు ప‌డుతోంది.తొలి బంతి నుంచే భారత్ బౌలర్లు పకడ్బందీగా అటాక్ చేస్తుండడంతో కివీస్ ఆత్మరక్షణలో పడిపోయారు.

ఏ జట్టుకైనా ఓపెనర్ల శుభారంభం అత్యంత కీలకం. కానీ ఈ విషయంలో కివీస్ కు మైనస్ మార్కులు పడ్డాయి. ఇద్ద‌రు ఓపెన‌ర్లు త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేరారు.ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (1: 14 బంతుల్లో)ని పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బోల్తా కొట్టించగా.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో ఓపెనర్ హెన్రీ నికోలస్ (28: 51 బంతుల్లో 2×4) బుట్టలో వేశాడు. జడేజా విసిరిన బంతిని డిఫెన్స్ చేసేందుకు నికోలస్ ప్రయత్నించగా.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి బ్యాట్, ఫ్యాడ్స్ మధ్య నుంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ని గీరాటేసింది. ప్ర‌స్తుతం 31 ఓవ‌ర్ల‌కు రెండు వికెట్లు కోల్పోయి 119 ప‌రుగులు చేసింది. క్రీజ్‌లో టేల‌ర్ 22, విలియంస‌న్ 56 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -