Monday, April 29, 2024
- Advertisement -

హై ఓల్టేజ్ మ్యాచ్..ఫైనల్ చేరేది ఎవరో?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడనుంది భారత్. నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ చేతిలోనే ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా లేదా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రోహిత్‌ సేన అన్నింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా న్యూజిలాండ్ 5 విజయాలు, 4 ఓటములతో నాలుగో స్థానంతో నిలిచింది. ఇక ఈ సారి భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ముందుకుసాగుతోంది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అంతా ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా విరాట్,రోహిత్,శ్రేయాస్, రాహుల్ అంతా ఫామ్‌లో ఉండటం చెప్పుకొదగ్గ విషయం.

ఇక న్యూజిలాండ్ సైతం అద్భుత ఆటతీరునే కనబరుస్తోంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ తిరిగి జట్టులో చేరడంతో పాటు రచిన్ రవీంద్ర అద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం.

తుది జట్ల అంచనా

భారత్‌:

రోహిత్‌శర్మ(కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, అయ్యర్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, షమీ, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, సిరాజ్‌.

న్యూజిలాండ్‌:

విలియమ్సన్‌(కెప్టెన్‌), కాన్వె, రచిన్‌, మిచెల్‌, లాథమ్‌, ఫిలిప్స్‌, చాప్‌మన్‌, సాంట్నర్‌, సౌథీ, ఫెర్గుసన్‌, బౌల్ట్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -