- Advertisement -
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తొలుత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రోహిత్ పాక్ను బ్యాటింగ్కు ఆహ్వానించారు.తొలుత ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించినా తర్వాత టెయిలెండర్లు చేతులెత్తేయడంతో పాక్ చిత్తతైంది. 200 పరుగులు కూడా దాటలేక పోయింది.
కీలక మ్యాచ్లో 50 ఓవర్లు కూడా ఆడలేకపోయిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ బాబర్ అజామ్ 50, రిజ్వాన్ 49 పరుగులు యేయగా మిగితా బ్యాట్స్మెన్ అంతా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా,సిరాజ్,పాండ్యా,కుల్దీప్,జడేజా తలో రెండు వికెట్లు తీశారు.
ఇక ఈ మ్యాచ్లో భారత్కు పాక్ గట్టి పోటీ ఇస్తుందని భావించినా ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశ పర్చారు. భారత్కు శుభవార్త ఏంటంటే గాయం కారణంగా జట్టుకు దూరమైన గిల్ తుది టీమ్లో చోటు దక్కించుకున్నారు.