భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ రెం డో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది కేఎల్ రాహుల్ సేన. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తేనే సఫారీలు సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ టీమిండియా వశం కానుంది. సాయంత్రం 4:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
గత మ్యాచ్ లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయ్యర్ కు బదులుగా ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ బరిలో దిగనుండగా తిలక్ వర్మ, సంజు సంసన్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్ తో పటిష్టంగా ఉంది.
గత మ్యాచ్లో ఐదు వికెట్లతో సత్తా చాటిన అర్షదీప్ సింగ్, అలాగే ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ వంటి వారితో పేస్ దళం కూడా స్ట్రాంగ్ గానే ఉంది.
తుది జట్టు ( అంచనా )
టీమిండియా ; రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజు సంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, కుల్దిప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.