Sunday, April 28, 2024
- Advertisement -

సిరాజ్ ఆన్ ఫైర్..సఫారీ 55 పరుగులకే ఆలౌట్

- Advertisement -

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు పేసర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా హైదరాబాదీ బౌలర్ సిరాజ్ విశ్వరూపం చూపించాడు. 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. దీంతో 23.2 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌట్ అయింది దక్షిణాఫ్రికా. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా 2, ముకేశ్ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టారు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశారు. 8 మంది సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. నిప్పులు చెరిగే బంతులతో సఫారీ జట్టును విలవిలలాడించాడు సిరాజ్. జస్‌ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా ఒక్క సెషన్ కూడా పూర్తిగా ఆడలేకపోయింది. టీమిండియాతో టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు . 2015లో భారత్‌తో జరిగిన మ్యాచులో 79 పరుగులకు ఆలౌట్ అయింది. 2006లో 84 పరుగులకు ఆలౌట్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -