దక్షిణాఫ్రికా – భారత్ మధ్య ఇవాళ కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో సఫారీ జట్టు గెలుపొందింది.ఇక ఇవాళ కీలకమైన మూడో టీ20 జరగనుండగా ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను సమం చేయనున్నారు. లేదంటే సిరీస్ కొల్పోవడం ఖాయం.
ఇక ఇవాళ్టి మ్యాచ్లో ఇరు జట్లు మార్పులు, చేర్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యంతో గత మ్యాచ్కు దూరమైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముండగా శుభ్మన్ గిల్ పై వేటు పడే అవకాశం ఉంది. ఇక కుల్దీప్ స్థానంలో రవి బిష్ణోయ్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక దక్షిణాఫ్రికా కూడా జాన్సెన్, కొట్జె స్థానాల్లో నాండ్రె బుర్గర్, ఒటినెల్ బార్ట్మన్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండగా ఆల్రౌండర్ ఫెరీరాకు తుది జట్టులో అవకాశం దక్కనుంది.
జట్ల అంచనా:
దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్, బ్రిజ్కె, మార్క్మ్(్రకెప్టెన్), క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, ఫెరీరా, ఫెల్కువాయో, విలియమ్స్, బార్ట్మన్/బుర్గర్, శంసీ.
భారత్: జైస్వాల్, రుతురాజ్/గిల్, తిలక్వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), రింకూసింగ్, జితేశ్శర్మ, జడేజా, అర్ష్దీప్సింగ్, కుల్దీప్/బిష్ణోయ్, సిరాజ్, ముకేశ్కుమార్