Friday, May 3, 2024
- Advertisement -

ఆదుకున్న కెప్టెన్ కోహ్లీ, ధోని…..విండీస్ విజ‌య ల‌క్ష్యం 269

- Advertisement -

మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ 72, ధోనీ 56, కేఎల్ రాహుల్ 48, హార్ధిక్ పాండ్యా 46 పరుగులతో రాణించారు. ఆరో వికెట్‌కు ధోనీ, పాండ్యా 70 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనె బిగ్ షాక్ త‌గిలింది. రోహిత్ శర్మ 18 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు.

చివరి ఓవర్లో ధోనీ మెరుపులు మెరిపించడంతో కొహ్లీసేన గౌరవప్రదమైన స్కోర్ చేసింది. భారీ స్కోరు చేయ‌కుండా విండీస్ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. అవ‌స‌ర‌మైన సమ‌యంలో వికెట్లు తీస్తూ భార‌త్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. రోహిత్ శర్మ 18, విజయ్ శంకర్ 14, కేదార్ జాదవ్ 7 పరుగులు మాత్రమే చేశారు. వీరి ముగ్గురిని కీమర్ రోచ్ క్యాచ్ ఔట్ చేశాడు.కాగా విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 3 వికెట్లు తీయగా, షెల్డన్ కాట్రెల్, కెప్టెన్ జాసన్ హోల్డర్‌లు చెరో 2 వికెట్లు తీశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -