వెస్టిండీస్ టూర్లో టీమిండియా అదరగొడుతోంది. టీ20, వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న కోహ్లీసేన గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్కి భారత్ సిద్ధమవుతోంది. టెస్టుల్లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్ కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకి తొలి టెస్టు ప్రారంభంకానుంది.
ఇదలా ఉంటె ఈటూర్ లో టెస్టుల్లో రవీంద్ర జడేజా ముంగిట రికార్డు ఉంది. టెస్టు కెరీర్లో ఇంకా ఎనిమిది వికెట్లు సాధిస్తే ‘డబుల్ సెంచరీ’ మార్కును చేరతాడు. 8 వికెట్లు సాధిస్తే భారత పదో బౌలర్గా అరుదైన రికార్డ్లో నిలవనున్నాడు. ప్రస్తుతం 41 టెస్టుల్లో 192 వికెట్లతో జడేజా ఉండగా.. ఒకవేళ తొలి టెస్టులోనే ఆ 8 వికెట్లు తీస్తే..? వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో భారత బౌలర్గా నిలవనున్నాడు
ఈ జాబితాలో రవి చంద్రన్ అశ్విన్ ముందంజలో ఉన్నాడు. భారత్ తరఫున అశ్విన్ 37 టెస్టు మ్యాచ్ల్లోనే 200 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో హర్భజన్ సింగ్ ఉన్నాడు