Friday, May 3, 2024
- Advertisement -

వన్డే సిరీస్ మనదే..

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. భారత్ విధించిన 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ టోని 81 పరుగులు ఒంటరి పోరాటం చేయగా మార్‌క్రమ్ 36,క్లాసెన్ 21 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి తప్పలేదు. అర్షదీప్ 4 ,ఆవేశ్, సుందర్ తలో 2 వికెట్లు తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 296 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేయగా తిలక్ వర్మ 77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 52 పరుగులు చేశారు. రింకు సింగ్ 38,పటిదార్ 22 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరాన్ హెండ్రిక్స్ 3, నాండ్రే బర్గర్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -