Thursday, May 16, 2024
- Advertisement -

బౌల‌ర్ల విజృంభ‌న‌…భార‌త్ విజ‌య‌ల‌క్ష్యం 135..

- Advertisement -

వాంఖడే వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌‌లో శ్రీలంక జట్టు ఆదిలోనే తడబడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఓపెనర్ డిక్వెల్లా (1) ఫీల్డర్ సిరాజ్ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా (4) బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నంలో నేరుగా బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మూడో టీ20లో శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. గుణ‌ర‌త్నే(36), స‌మ‌ర‌విక్ర‌మ (21) మిన‌హా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ నిల‌క‌డ‌గా రాణించ‌క‌లేక‌పోయారు. డిక్ వెలా (1), కుశాల్ (4), త‌రంగ (11) , స‌మ‌ర‌విక్ర‌మ‌(21) గుణ‌తిల‌క (3), పెరీరా (11) వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్లు పెవిలియ‌న్ చేరారు. దీంతో ఆ జ‌ట్టు భార‌త్ ముందు 136 స్వ‌ల్ప టార్గెట్ ను మాత్ర‌మే ఉంచ‌గ‌లిగింది. భార‌త్ బౌల‌ర్ల‌లో ఉనాద్క‌ట్ రెండు వికెట్లు, పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సుంద‌ర్, కుల‌దీప్, సిరాజ్ లు చెరో వికెట్ తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -