- Advertisement -
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఉప్పల్లో తొలి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు..ఎలాగైనా ఈ సిరీస్ నెగ్గాలని చూస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో పూర్తిస్థాయి ప్రపంచకప్ జట్టు బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రదర్శనపై అంచనాలు బాగా నెలకొన్నాయి. మరోవైపు పొట్టి సిరీస్ గెలిచి జోరు మీదున్న ఆసీస్ వన్డే సిరీస్ సొంతం చేసుకుని భారత పర్యటనను ఘనంగా ముగించాలని ప్రయత్నిస్తోంది.