Saturday, May 4, 2024
- Advertisement -

చావ‌ల్ మ్యాజిక్ ఏడు వికెట్లు కోల్పోయిన ఆసిస్..

- Advertisement -

మెల్‌బోర్న్‌లో భార‌త్ త్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆసిస్ క‌ష్టాల్లో ప‌డింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పేసర్ భువనేశ్వర్ భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. మూడో ఓవర్ చివరి బంతికి కేరీ(5)ని ఔట్ చేసి ఓపెనింగ్ జోడిని ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఆరోన్ పించ్ మ‌రో సారి భూవి చేతికి చిక్కాడు.

హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ఆస్ట్రేలియాను ఆదుకున్న ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్‌లను యజ్వేంద్ర చహాల్ బోల్తా కొట్టించాడు. అంతకుముందు స్టొయినిస్‌ (10) చాహల్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపు మెరుపులు మెరిపించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం ఔటవ్వడంతో 161 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం ఆసిస్ స్కోరు 206/6 కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం క్రీజ్‌లో హ్యాండ్స్‌కోంబ్ (52), రిచర్డ్‌సన్‌(16) దూకుడుగా ఆడుతున్న ఆసిస్ ను మ‌రో దెబ్బ కొట్టాడు చావ‌ల్‌. చావ‌ల్ బౌలింగ్‌లో జాద‌వ్‌కు క్యాచ్ ఇచ్చి రిచర్డ్‌సన్ వెనుతిరిగారు. రెండు వన్డేలు ముగిసే సరికి 1-1తో సిరీస్‌లో సమవుజ్జీలుగా నిలిచిన రెండు జట్లు నేటి మ్యాచ్‌తో అమీ తుమీ తేల్చుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -