Sunday, May 12, 2024
- Advertisement -

కాసేపట్లో.. ఇండో ఆసీస్ డూ ఆర్ డై మ్యాచ్

- Advertisement -

ఒకటే మ్యాచ్.. రెండు జట్లు.. సెమీస్ కోసం పోరాటం.. గెలవాలని అభిమానుల ఆరాటం. కాసేపట్లో మొహాలీ వేదికగా జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ పై.. 2 దేశాల అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సిరీస్ లో అడుగు ముందుకు వేయాలంటే.. టైటిల్ సాధించే ఆశలు నిలుపుకోవాలంటే.. గెలిచి తీరాల్సిన గేమ్ లో.. సత్తా చాటేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు సంసిద్ధమయ్యాయి.

ఇప్పటివరకూ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ఆటల్లో.. 2 జట్లు సమాన ప్రతిభ ప్రదర్శించాయి. రెండూ.. ఒకే జట్టుపై (న్యూజిలాండ్) ఓడిపోయాయి. 3 గేమ్ లు ఆడితే.. చెరో 2 ఆటలు గెలిచి పాయింట్ల పరంగా సమస్థానంలో ఉన్నాయి. బలాబలాల పరంగా కూడా ఈక్వల్ గా ఉన్నాయి. మంచి ఓపెనర్లు, ఆల్ రౌండర్లు, టైమ్ కు తగ్గట్టుగా గేమ్ ప్లాన్ మార్చే కెప్టెన్.. చురుకైన ఫీల్డర్లు, బ్రేక్ చేసే బౌలర్లు.. ఇలా 2 జట్లూ వేటికవే టాప్ కండిషన్ లో ఉన్నాయి.

సొంత గడ్డపై ఆడుతున్న సానుకూలతతో పాటు.. టాప్ ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు భారత జట్టు బలమైతే.. దేశంతో సంబంధం లేకుండా, ప్రత్యర్థుల సామర్థ్యంపై ఆలోచనే లేకుండా.. మ్యాచ్ ను సొంతం చేసుకోగల సామర్థ్యం ఆసీస్ సొంతం. దీంతో.. ఈ మ్యాచ్ కు టోర్నమెంట్ లోనే అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

పేరుకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కాకున్నా.. జరిగేది మాత్రం అదే. ఎందుకంటే.. ఇందులో గెలిస్తేనే న్యూజిలాండ్ తో పాటు.. గ్రూప్ బి నుంచి సెమీస్ లో రెండో జట్టుగా అడుగుపెట్టగలరు. అందుకే.. ధోనీ గ్యాంగ్ తో పాటు.. ఆసీస్ టీమ్ కూడా క్వార్టర్ కాని క్వార్టర్స్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. చూడాలి.. ఎవరు గెలుస్తారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -