- Advertisement -
విశాఖపట్నం. అందాల పట్నం. ఈమధ్యే వన్ డే క్రికెట్ కు వేదికగా మారిన విశాఖ స్టేడియానికి ఇప్పుడు టెస్ట్ హోదా దక్కింది. త్వరలో ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఓ మ్యాచ్ విశాఖపట్నంలో నిర్వహించున్నాను.
ఈ సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లు రాంచీ, ధర్మశాల, రాంచీ, ఇండోర్ లలో జరుగుతాయి. ఇక వచ్చే సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు మొత్తం 13 టెస్ట్లు, 8 వన్డేలు, 3 టీ20లు, 918 దేశవాళీ మ్యాచ్లు ఆడేలా బీసీసీఐ టూర్ ప్రోగామ్ కమిటీ నిర్ణయించింది. స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో భారత క్రికెట్ జట్టు తలపడనుంది. ఈ సంవత్సరం నవంబర్, డిశెంబర్ నెలల్లో ఇంగ్లాండ్ జట్టే భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ లు, మూడు వన్డేలు, మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడుతుంది.