- Advertisement -
దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ విజయం భారత్ను ఊరిస్తూనే ఉన్నది. గత రెండున్నర దశాబ్దాలుగా సిరీస్ గెలుపు మనకు అందని ద్రాక్షగానే మారింది. కెప్టెన్లు, తరాలు మారుతున్నా..ఫలితంలో మాత్రం మార్పురావడం లేదు. మేటి జట్లను మట్టికరిపిస్తూ వరుస సిరీస్ విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా ఈసారైనా..చరిత్రను తిరుగరాస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
డర్బన్ వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన డివిలియర్స్ స్థానంలో మార్క్ రమ్ బరిలోకి దిగుతున్నాడు.