భారత్ను మరో రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా …ఇప్పుడు వన్డే రికార్డుపై కన్నేసింది. శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్ను వైట్ వాష్ చేస్తే వన్డేల్లో భారత్ నెంబర్ 1 స్థానాన్ని చేరుకుంటుంది.
శ్రీలంకతో సిరీస్ను 3-0తో భారత్ సొంతం చేసుకుంటే 121 రేటింగ్ పాయింట్లు వస్తాయి. దాంతో 120 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికాను భారత్ దాటేసి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఒకవేళ సిరీస్ను ఓడినా లేక 2-1 తేడాతో గెలిచినా భారత్ రేటింగ్ పాయింట్లు 119కి తగ్గిపోతాయి. అప్పుడు ఇక భారత్ రెండో స్థానానికే పరిమితం కావాల్సి వస్తుంది.
శ్రీలంకతో సిరీస్లు అయిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటన భారత్కు సవాల్తో కూడుకున్నది. లంకేయులతో సిరీస్ను వైట్వాష్ చేసి అగ్రస్థానం పొందినా దక్షిణాఫ్రికాతో గట్టిపోటీ ఎదుర్కోనుంది. దక్షనాఫ్రికా టూర్లో భారత్ మూడు టెస్టులు, 6 వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
జనవరి 9 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా, ఫిబ్రవరి 1 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తద్వారా వన్డే టాప్ ర్యాంకు కోసం ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. దక్షిణాఫ్రికా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ ఫలితం వాటి ర్యాంకింగ్స్పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.