Thursday, May 2, 2024
- Advertisement -

మొద‌టి వ‌న్డేకోసం సిద్ద‌మవుతున్న టీమిండియా..

- Advertisement -

విండీస్‌తో వ‌న్డే సిరీస్‌కోసం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఆది వారం నుంచి వ‌న్డే సిరీస్ మొద‌లు కానుంది. మొద‌టి వ‌న్డే గౌహ‌తిలో జ‌ర‌గ‌నుంది. ప్రాక్టీస్ కోసం ఆట‌గాల్లంద‌రూ గౌహ‌తి చేరుకొని ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్‌ తర్వాత ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ కేఎల్ రాహుల్, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌తో కలిసి ఈరోజు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు.

ఇప్ప‌టికే టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలిచి మంచి ఊపుమీదున్న ఇండియా వ‌న్డేసిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెం.1 స్థానంలో కొనసాగుతున్న టీమిండియాకి ఏ దశలోనూ కరీబియన్ టీమ్ పోటీనివ్వలేకపోయింది. కనీసం ఐదు వన్డేల సిరీస్‌లోనైనా పోటీనిస్తుందా..? అంటే డౌటేనని సమాధానాలు వినిపిస్తున్నాయి. విండీస్‌కు ప్ర‌ధాన ఆట‌గాళ్లు దూర‌మ‌య్యిన సంగ‌తి తెల‌సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -