Sunday, May 12, 2024
- Advertisement -

చేజ్ సెంజ‌రీ..విండీస్ 311 అలౌట్‌..మొద‌టి వికెట్ కోల్పోయిన భార‌త్‌

- Advertisement -

రాజ్‌కోట్ టెస్ట్‌లో కనీసం పోరాడకుండానే చేతులేత్తేసిన విండీస్ ప్లేయర్లు, ఉప్పల్‌లో మంచి ప్రదర్శన కనబరిచారు.ఏడు వికెట్లకు 295 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన విండీస్… స్కోరు బోర్డుకు మరో 16 పరుగులు మాత్రమే జత చేసింది. మొత్తం మీద 101.4 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఉమేష్ యాదవ్ తన కెరీల్ లో బెస్ట్ ఫిగర్స్ సాధించాడు. 88 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. చివరి మూడు వికెట్లు కూడా ఉమేష్ ఖాతాలోకే చేరాయి.

బ్రాత్‌వైట్ 14, పోవెల్ 22, షై హోప్ 36, షిమ్రాన్ హెమియర్ 12, సునీల్ అంబ్రిస్ 18 పరుగులు చేశారు. రోస్టన్ ఛేజ్ 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 106 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.రొస్టన్ ఛేజ్‌కిది టెస్టుల్లో నాలుగో సెంచరీ కాగా భారత్‌పై రెండోది. విదేశాల్లో అతనికిదే తొలి సెంచరీ. షేన్ డోరిచ్ 30, జాసన్ హోల్డర్ 92 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. దేవేంద్ర బిషో 2 పరుగులు చేయగా…. షనాన్ గాబ్రియల్ డకౌట్ అయ్యాడు. జోమిల్ వారికన్ 8 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా దూకుడుగా ప్రారంభించిన ఇండియాకు ఎదురు దెబ్బ త‌గిలింది. హోల్డ‌ర్ బౌలింగ్ రాహుల్ పెవిలియ‌న్ చేరాడు.క్రీజులో పృథ్వీషా, పుజారా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -