- Advertisement -
భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే పుణె వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన భారత్.. విశాఖపట్నం వన్డేను టైగా ముగించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత్ తుది జట్టులో విరాట్ కోహ్లి మూడు మార్పులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ మళ్లీ జట్టులోకిరాగా.. జడేజా, ఉమేశ్, షమీపై వేటు పడింది.
Captain @imVkohli wins the toss and elects to bowl first in the 3rd ODI against Windies at Pune.#INDvWI pic.twitter.com/OTBoRAak5y
— BCCI (@BCCI) October 27, 2018