రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్తో జరగనున్న తొలి టెస్టు కోసం 12 మందితో కూడిన భారత జట్టును సెలక్టర్లు బుధవారం ప్రకటించారు. అండర్ 19 స్టార్ పృథ్వీ షా టెస్టు అరంగేట్రం చేయనుండగా.. హైదరాబాద్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బ్యాట్స్మన్ మయాంక్ అగర్వాల్లకు ఈ టీమ్లో చోటు దక్కలేదు.
కేఎల్ రాహుల్తో కలిసి అతడు ఓపెనర్గా బరిలో దిగనున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగానే పృథ్వీ షాకు పిలుపు అందింది. కానీ అతడికి తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక టీమ్లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్లకు చోటు కల్పించారు. ఆ లెక్కన తుది జట్టులో స్థానం కోసం పేసర్లు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సమయంలోనూ పృథ్వీ షా టీమ్తోపాటే ఉన్నా.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక ఓవల్లో ఇంగ్లండ్తో టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన హనుమ విహారికి కూడా తుది జట్టులో స్థానం దక్కలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావించడంతో విహారిని పక్కన పెట్టక తప్పలేదు.
తొలి మ్యాచ్లో భారత జట్టు ఐదుగురు స్పెష్టలిస్ట్ బౌలర్లతో తొలి టెస్టులో బరిలో దిగనుంది. శార్దుల్ ఠాకూర్ 12వ ఆటగాడిగా ఉండే ఛాన్స్ ఉంది. ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్లతోపాటు పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్ మొదటి టెస్టులో ఆడనున్నారు. రిషబ్ పంత్ ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగనున్నాడు.
జట్టు: కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దుల్ ఠాకూర్