- Advertisement -
ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత మహిళల బృందం స్వర్ణం సాధించింది. ఇందులో మను బాకర్, యశస్విని దీస్వాల్, శ్రీ నివేదా పరమనాథన్ ఉన్నారు. ఆదివారం జరిగిన పోరులో పోలాండ్ బృందంపై గెలిచి ఈ పతకం చేజిక్కుంచుకుంది.
ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, పంకజ్ కుమార్లతో కూడిన బృందం.. వెండి పతకం సాధించింది. మహిళల విభాగం కాంస్యం సొంతం చేసుకుంది.
ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు షూటర్లకు వైరస్ సోకినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. వారు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగానికి చెందిన వారు.
ఒక వైపు ఆట.. మరో వైపు కరోనా కాటు..!