Friday, April 26, 2024
- Advertisement -

ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ కి స్వర్ణం..!

- Advertisement -

ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లోని 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ విభాగంలో భారత మహిళల బృందం స్వర్ణం సాధించింది. ఇందులో మను బాకర్, యశస్విని దీస్వాల్, శ్రీ నివేదా పరమనాథన్ ఉన్నారు. ఆదివారం జరిగిన పోరులో పోలాండ్ బృందంపై గెలిచి ఈ పతకం చేజిక్కుంచుకుంది.

ఎయిర్​ రైఫిల్​ విభాగంలో ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, పంకజ్ కుమార్​లతో కూడిన బృందం.. వెండి పతకం సాధించింది. మహిళల విభాగం కాంస్యం సొంతం చేసుకుంది.

ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు షూటర్లకు వైరస్​ సోకినట్లు ఆదివారం నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించినట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్​ ప్రతినిధి తెలిపారు. వారు 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగానికి చెందిన వారు.

ఒక వైపు ఆట.. మరో వైపు కరోనా కాటు..!

సురభి వాణీదేవి గెలిచాక మాటలు ఇలా..!

నేటి నుంచి భారత్ లో అక్కడ లాక్ డౌన్ మొదలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -